పోస్ట్‌లు

"నేతన్నల బతుకు చిత్రం" - ప్రో" కోదండరాం | పోగుబంధం పుస్తక సమీక్ష

చిత్రం
ప్రముఖ సామాజిక కవి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించిన "పోగుబంధం" పుస్తకంలో తెలంగాణ ఉద్యమ రథసారథి, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు, టీజేఏసి అధినేత ప్రోఫెసర్ కోదండరాం సర్ ముందుమాట.. " నేతన్నల బతుకు చిత్రం " సమీక్ష.. 13-Nov-202, ఘంటారావం దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయినది.. "నేతన్నల బతుకు చిత్రం" ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రాజనీతిశాస్త్ర విశ్రాంతాచార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం టిజేఏసి - టీజేఎస్ డా"మోహనకృష్ణభార్గవ "పోగు బంధం" కవితా సంపుటిలో "శిధిలమైన శిలలకింద చిక్కిన చేనేత చరిత"ను వెలుగులోనికి తేవడానికి ప్రయత్నించాడు. వ్యవసాయంతో సమానంగా అత్యంత ప్రాధాన్యత కల రంగం చేనేత. ఇప్పటికీ చేనేతరంగం బలంగా నెలకొని ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,069 చేనేత మగ్గాలున్నాయి. కానీ చేనేత కార్మిక సంఘాల అంచనా ప్రకారం సుమారు 50,000 మగ్గాలున్నాయి. ప్రభుత్వ సర్వేలో 40,533 మంది కార్మికులు చేనేతపై ఆధారపడి బతుకుతున్నారు. కార్మిక సంఘాలు ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు...

అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్న డా" మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మోహనకృష్ణభార్గవ" - అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం, యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్, ఇండో - అమెరికన్ ఆష్ట్రోలాజికల్ అవార్డ్  అందుకున్న ఏకైక తెలంగాణ జ్యోతిష్యుడు -  వరల్డ్ ఆష్ట్రోలజర్స్ బయోగ్రఫీ లో ప్రముఖ స్థానాన్ని పొందిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ న్యూఢిల్లీ, ఆదివారం 17 : జనగామ జిల్లాకి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు, సామాజిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ కు అరుదైన గౌరవం, ప్రపంచ స్థాయి గుర్తింపు లభించాయి. ఇంటర్నేషనల్‌ ఆష్ట్రోలజీ ఫెడరేషన్(యూఎస్ఎ) మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సొసైటీస్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్, మహర్షి పరాశర జ్యోతిష్య విశ్వవిద్యాలయం, సంస్థలతో పాటు ప్రపంచ ప్రముఖ జ్యోతిష్య సంస్థలు, విశ్వవిద్యాలయాల సంయుక్త నిర్వహణలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన వేదిక్ ఆస్ట్రోలాజికల్ కన్క్లేవ్-2021. అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థల సమ్మేళనంలో డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సభలో లోక్ సభ సభ్యులు సునీల్ బి. మ...

యమ ద్వితీయ | భగినీ హస్త భోజనం

చిత్రం
" భగినీ హస్త భోజనం " యమ ద్వితీయ - భ్రాతృ ద్వితీయ కార్తీక శుద్ధ విదియ.. అన్నా చెల్లెల్లకు, అన్నా తమ్ముళ్ళకు ప్రత్యేకమైన పండుగ. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం మొదటి పండగ అయితే భగినీ హస్త భోజనం రెండవ విశేషమైన పండుగ గా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. రక్షాబంధనానికి సోదరి సోదరుని గృహానికి వచ్చి పండగ జరుపుకుంటారు. అదే భగినీ హస్త భోజనానికి సోదరులు సోదరి గృహానికి రావటం ఆనవాయితీగా వస్తుంది. అంటే సోదరి  మెట్టినింట ఆతిథ్యాన్ని స్వీకరించడం. నేను నీకు సర్వదా రక్షగా నిలుస్తానని రక్షాబంధనం రోజున వాగ్దానం చేయడమే గాని సోదరి మెట్టినింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా మెట్టినింట భోజనం చేయడం, అత్తవారింట సొమ్ముతినడం పాపంగా భావిస్తుంటారు. కానీ పుట్టినింట సోదరికి రక్ష అవసరమేమున్నది.? సమాజాన్ని ఎదుర్కోవాలన్నా, మెట్టినింట ఎదురయే కష్టాలని ఎదుర్కోవాలన్నా.. వాటిని అర్థం చేస్కుని తోడుగా నిలిచే సోదరుడు ఎంతైనా అవసరం కదా..! అందుకు ఇలాంటి పర్వదినాలు అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి కేవలం ఆతిథ్యాలు, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రమే కాదు. అక్కచెల్లెళ్ళకు పుట్టింటి అండదండలతో మేమున్నామనే నమ్మకాన్ని...

మనుస్మృతి -The Law Code Of Manu

చిత్రం
మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) : THE LAW CODE OF MANU  (CODE OF LAW) భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది) "మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను "గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ "శంఖలిఖితుల రచన"  ద్వాపర యుగం లోనూ ప్రామాణికం అవగా ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనువు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడ్డాడు, హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన  "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది.,   ఇంతకీ మనువు ఎవరూ, మనుస్మృతి కి ఎందుకింత ప్రాథాన్యత సంతరించుకుంది.? 36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను  దీనినే "దైవ యుగం" అందురు అట్టి దైవ యుగాలు 71 అయితే  మన్వంతరం అనబడుతుంది, మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము, మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు "స్వాయంభువు" బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించినట్లు, భృగువు మానవాళికి మనుస్మృతి ...

ధర్మో రక్షతి రక్షితః

                "ధర్మో రక్షతి రక్షితః" శ్లో" ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః ! తస్మాధ్ధర్మో న హంతన్యో మా నో ధర్మో హతోఁవదీత్" తా: ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు మనకు హాని తప్పదు ! కనుక ధర్మం ఎప్పుడూ నశింపకూడదు ధర్మానికి ఎవరైతే కీడు కలిగిస్తారో వారి నాశనం తప్పదు !! ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది !! శ్లో" వృషో హి భగవాన్ ధర్మ స్తన్య యః కురుతే హ్యలమ్!  వృషలం తం విదుర్దేవా స్తస్మాధ్ధర్మం న లోపయేత్ " తా: సదా సంపూజ్యమైనది ధర్మం కోర్కెలన్నిటినీ వర్షించుచునట్టి వృషము వంటిది అట్టి వృషమును ఎవడైతే అడ్డుకుంటాడో అతడు మహా ప్రమాదకారి శ్లో" ఏక ఏవ సహృద్ధర్మో నిధనేఁ ప్యనుయాతి యః! శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్ఛతి " తా: ధర్మము అనేది ముఖ్యమైన మిత్రునివంటిది ఎందుకంటే మన మరణాంతరం అదొక్కటే మిత్రునిలా వెంబడిస్తుంది, మిగిలినవన్నీ మన దేహం తోనే నాశనం పొందుతాయి !!

సిరికి పుట్టింటివారు, హరికి అత్తింటివారు పద్మశాలీలు - Published In 2015

చిత్రం

సర్వోన్నత్ భారతీయ సంవిధాన్

చిత్రం

భృగు వంశాను కీర్తనము (5 వ భాగము)

చిత్రం
భృగు వంశాను కీర్తనము - (5వ భాగం) భృగు మహర్షి : వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు మరియు సప్త ఋషులలో ఒకరు "భృగు మహర్షి" భృగువు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ హృథయం నుండి జన్మించెను భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు అగ్ని తేజస్సు నుండి జన్మించినవాడు వరుణుని పుత్రుడు కనుక "వారుణీ విద్య" కు అధిపతి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం! యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!! మహర్షులలో భృగుమహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచెను మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను భృగు మహర్షి మొట్టమొ...

భృగు వంశాను కీర్తనం (4 వ భాగం)

చిత్రం
భృగు వంశావళి : భృగు మహర్షి పులోముని పుత్రిక అయిన "పౌలోమి" ను తృతీయ భార్యగా గ్రహించెను పౌలోమి వరవర్ణిని అత్యంత సౌందర్యవతి పౌలోమి గర్భము ధరించి ఉండగా ఒక క్రూరమైన రాక్షసునిచే ఎనిమిదవ నెలలో చేదింపబడెను అప్పుడు గర్భము నుండి పుత్రుడు జారిపడెను అందువలన అతడు "చ్యవనుడు" అను పేరు కలిగెను అతడే "సచేతసుడు" అగుట వలన "ప్రచేతసుడు" కూడా అయ్యెను ఇతడు ఇంద్రియ నిగ్రహము కలిగిన సద్బ్రాహ్మణోత్తముడు ఋషిశ్రేష్టుడు ఇతడు మానవులను చంపితినే పురుషాదకులైన రాక్షసులను సంహరించెను భార్గవుడు అయిన చ్యవనుడు "సుకన్య" ను వివాహమాడగా ఇద్దరు పుత్రులు కలిగిరి వారు ౧) అప్రవానుడు ౨) దధీచుడు ౧) అప్రవానుడు నహుషుని పుత్రికయగు "ఋచి" ను వివాహామాడెను హైహయ క్షత్రియులు భార్గవులను నాశనం చేయు దుస్కృత్యంలో గర్భవతియైన ఋచిని సంహరించ వెంబడించగా ఋచి తొడను చీల్చుకొని పుత్రుడు ఉద్భవించెను అందుచే అతడు "ఔర్వుడు" గా ప్రసిద్దుడాయెను ఔర్వుని కుమారుడు "ఋచికుడు"  అతడు దీప్తాగ్నుతో సమానమైన తేజో విశేషము కలవాడు వీరు భృగువు ఇచ్చిన యజ్ఞప్రసాదము గ్రహింపుట ...

భృగు వంశాను కీర్తనం (2 వ భాగం)

చిత్రం
భృగు వంశాను కీర్తనము : (2 వ భాగం) భృగు ప్రజాపతి వంశ క్రమ ఉపోద్ఘాతం : (భృగు - ఖ్యాతి వంశావళి) బ్రహ్మ సృష్టికార్యార్థం బ్రహ్మ సమానులైన నవ బ్రహ్మలను (ప్రజాపతులను) సృష్టించెను వారు సకల దేవతలను ఋషులను మానవులను గ్రహాలను నక్షత్రమండలాలను వేదాలను ధర్మశాస్త్రాలను సకల జీవరాశులను సకల లోకాలను యక్షరాక్షసాదులను గృహాలను నివాసాలను ఆహారాదులను సర్వాన్ని సృష్టించిరి ప్రజాపతులలో ప్రథముడు సకల లోకాలకు దేవతలకు ఋషులకు పూజ్యుడు మహాత్ముడు బ్రహ్మ మానస పుత్రుడు దేవర్షి "భృగు మహర్షి" దక్షప్రజాపతికి ఇరవది నలుగురు కుమార్తెలు వీరే చతుర్వింశతి మృత్తికలు వారందరూ మహాభాగలు కమలలోచనుకు యోగపత్నులు యోగ మాతలు వారందరూ బ్రహ్మవాదినులు వీరందరూ విశ్వమునలు తల్లులు వారిలో "శ్రద్ధ, లక్ష్మి, ధృతి ,తుష్టి, పుష్టి, మేథ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతీ ,కీర్తి, " అనే పదమూడు మందిని "ధర్ముడు" వివాహమాడెను ఖ్యాతిని - భృగువు, సతిని - రుద్రుడు, సంభూతిని - మరీచి, స్మృతిని - అంగీరసునికి, ప్రీతిని -పులస్త్యునకు, క్షమను - పులహునకు, సంతతిని - క్రతువునకు, అనసూయను - అత్రికి ,ఊర్జను -వశిష్ఠునకు , స్వ...

భృగు వంశాను కీర్తనం (3 వ భాగం)

చిత్రం
భృగు వంశావళి : భృగు మహర్షికి ముగ్గరు భార్యలు వారు ౧) ఖ్యాతి ౨) దివ్య ౩) పౌలోమి వీరిలో ఖ్యాతి దేవి వంశమును గూర్చి తెలుసుకున్నాము హిరణ్యకశిపుని పుత్రిక "దివ్య" అత్యంత సౌందర్యవతి భృగువునకు ఇచ్చి వివాహం చేసిరి వారికి పన్నెండు మంది దేవులైన మహాపురుషులు కుమారులు జన్మించిరి వారు.. ౧) శుక్రుడు ౨) భువనుడు ౩) భావనుడు ౪) అంత్యడు ౫) అంత్యాయనుడు ౬) క్రతువు ౭) శుచి ౮) స్వమూర్థా ౯) వ్యాజుడు ౧౦) వసుదుడు ౧౧) ప్రభువుడు ౧౨) అవ్యముడు వీరంతా భృగు భార్గవులుగా ప్రసిద్ధులు శుక్రుడు బ్రహ్మవిద్వద్వరులలో మహా శ్రేష్టుడు దేవతలకు అసురులకు గురువు సామగానుడు కావ్యునిగా ఉశనడుగా ప్రఖ్యాతిపొందెను నవ గ్రహమండలమున స్థానం పొందెను ఇతడు సోమపులైన పితరుల యొక్క మానసీ కన్య "గౌ" అనే పేరు గల ప్రసిద్ధురాలిని వివాహమాడెను వీరికి నలుగురు నలుగురు పుత్రులు కలిగిరి వారు ౧) త్వష్ట ౨) వరత్రి ౩) శందుడు ౪) మార్కుడు వారు తేజస్సులో ఆదిత్యుని సమానులై ప్రభావములో బ్రహ్మ సమానులైరి వరత్రి కుమారులు ౧)రజతుడు, ౨)పృథువు, ౩)రశ్మి బృహంగిరుడు వీరు బ్రహ్మిష్టులు దైత్యులకు యజ్ఞములు చేయించువారైరి వీరు యజ్ఞమునను...

భృగు వంశాను కీర్తనం.. (1 వ భాగం)

చిత్రం
భృగు వంశానుకీర్తనం : ప్రపంచోత్పత్తి : శ్లో : ఆసీదిదం తమో భూత మప్రజ్ఞాత మ లక్షణం! అప్రతర్మ్య మవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః !! ప్రళయకాలంలో విశ్వమంతయూ బ్రహ్మలో అవ్యాకృతమై (లోనమై) ఉన్నది పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండి యున్నది ఊహలకు అందనటువంటి లక్షణ రహితమైనది ప్రత్యక్ష ప్రమాణ గమ్యం కానిది కనీసం శబ్థమయినా లేని గాఢాంధకారములో నిద్రిస్తున్నట్లుగా ఉంది శ్లో : ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః ! ఆయనం తస్య తాః ప్రోక్తాస్తేన నారాయణః స్మృతః !! యుగ సహస్ర కాల పర్యంతం స్వచ్ఛమైన కమలపత్ర తలమున బ్రహ్మత్వాదర్శ కారణమున ఆత్మానాత్మ వీక్షించుచు శాంతవచోవిలాసుడు "శ్రీమన్నారాయణుడు" నిద్రించుచుండెను సృష్టి పునరుత్పత్తి చేయదలచి నారాయణుడు నీటి యందు మునిగి ఉన్న సకల లోకములను ఉద్ధరింపవలెనని తలంచెను అంతట నారాయణుడు సర్వ భూతములకు అదృశ్యము, బ్రహ్మ సంజ్ఞితమయిన వాజ్మయమును, దశయోజన విస్తీర్ణము శత యోజన ఆయతము, మహా పర్వతము వంటి శరీరము మహాబలశాలియగు శరీరము , సహాస్ర సూర్యుల తేజస్సు కల "వారాహ రూపము" ను ధరించెను నీట ప్రవేశించి అగ్నిచే ఆచ్ఛాదింపజేసి భూర్భువాది సకల లోకములను వేరు చేసెను ...

గాయత్రీ (యజ్ఞోపవీత) ధారణా నియమాణాలు

చిత్రం
గాయత్రి(యజ్ఞోపవీత)ధారణ నియమాలు: బ్రాహ్మణ..క్షత్రియ ..వైశ్యులు ఉపనయణ సంస్కారం చేత ద్విజాధికారం పొందగలరు చాతుర్వర్ణ విభజన బ్రాహ్మణ. క్షత్రియ. వైశ్య.శూద్రాది ధర్మములు లక్షణములు  నియమములు బ్రహ్మచర్య..గృహస్థు ..సన్యాస..ధర్మములు "మనుస్మృతి "యందు తెలియజేసిరి.. "స్వకర్మణా తమభ్యర్య్చ సిద్దిం విందతి మానవః" తన స్వ ధర్మాచరణము ద్వారా పరమేశ్వరుని పూజించుట వలన మానవుడు పరమ సిద్ది మోక్షం పొందును నిత్యము..నైమిత్తికము..కామ్యములు అను మూడు కర్మలను ఆచరించుట ప్రతి ఒక్కరి ముఖ్య కర్తవ్యమని సకల వేద శాస్త్రములు చెప్పుచుండెను జననముతోడనే ప్రతీ వ్యక్తికి మూడు విదముల ఋణములు ఉండును ౧దేవ ఋణము ౨ఋషి ఋణము ౩పితృ ఋణము "యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాశ్చ మానుషాత్" నిత్య కర్మలను చక్కగా ఆచరించుటవలన త్రివిధ ఋణ విముక్తుడగును ప్రతి నిత్యము తప్పక ఆచరించ వలసిన షట్-కర్మలు చెప్పబడెను "సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాం చ పూజనమ్ వైశ్వదేవం తథాఁఁతిథ్యం షట్ కర్మాణి దినే దినే" ౧స్నానము...౨సంధ్యావందనము...౩జపము...౪దేవతారాధనము....౫బలి-వైశ్వదేవము....౬అతిథి పూజనము అనే...

చాతుర్వర్ణముల విభజన

చిత్రం
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణ విభజనపై  చాలా రకాల భిన్నాభిప్రాయాలు చూపుతున్నారు అందలి నా అభిప్రాయము...... చాతుర్వర్ణముల విభజన : "బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత" మహా పురుషుని(విష్ణువు ) ముఖము నుండి బ్రాహ్మణులు భుజముల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు (వాక్కు ద్వారా జీవణం గడుపువారు -బ్రాహ్మణులనియు భుజముల ద్వారా పోరాటములు యుద్ధములు చేయువారు -క్షత్రియులనియు ప్రయాణాదిక వ్యాపారం వ్యవసాయము చేయు వారు - వైశ్యులనియు సేవకా వృత్తి, సోమరితనము, నీచాలోచనలు కలవారు -శూద్రులని అనెదరు) భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ ఇలా చెప్పెను "బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై" పృథివి యందలి ప్రతీ ప్రాణి కూడా సత్వ.... రాజస ....తామస........ అను మూడు గుణములు కలిగివుందురు మానవుడు వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి బ్రాహ్మణ. క్షత్రియ.   వైశ్య.  శూద్రులను చాతుర్వర్ణములను విభజించి వారి స్వాభావిక కర్మములు..  ధర్మ.......

గాయత్రీ మంత్రార్థము

చిత్రం
గాయత్రీ  మంత్ర అర్థము :: సంధ్యోపాసన విది:: ఓం భూర్భువస్సువః ! తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ! ధియో యోనః ప్రచోదయాత్ !! తా: ఓం = సర్వ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపం భూః = సత్స్య రూపమైనది, భువః = చిత్స్య రూపమైనది, స్వః =ఆనంద స్వరూపమైనది, దేవస్య = స్వయం జ్యోతి స్వరూపమైనది, సవితుః = సృష్టి స్థితి లయ కారణమైనది (బ్రహ్మాత్మకమైనది), వరేణ్యం= శ్రేష్ఠమైన (విష్ణ్వాత్మకం), భర్గః = అజ్ఞానమనెడు చీకటిని పోగొట్టునది (శివాత్మకమైనది), యః = ఏ తేజస్సు అయితే, నః = మా యొక్క, ధియః = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరేపించుచున్నదో, తత్ = ఆ బ్రహ్మ తేజస్సును మేము,  ధీమహి = ధ్యానము చేసెదము.. తా::   పరబ్రహ్మ స్వరూపము...  పరిపూర్ణమైనది... అది సచ్చిదానంద స్వరూపము.....  స్వయం జ్యోతి స్వరూపము .... అది సృష్టి  ..స్థితి  ..లయ ..కారకము.. అత్యంత శ్రేష్టమైనది ...అజ్ఞాన మనేడి చీకటిని రూపుమాపునది ....అట్టి దివ్య తేజస్సు మా బుద్ధులను (సన్మార్గమున) ప్రేరేపించు గాక!! ఆ పర బ్రహ్మ తేజస్సును మేము ధ్యానించెదము... (మా యొక్క బుద్ధి వృత్తులను ప్రేరేపించు అంతర్యామి యగు ఏ ...

మను స్మృతి

చిత్రం
మను స్మృతి (మానవ ధర్మ శాస్త్రం) : THE LAW CODE OF MANU (CODE OF LAW) భృగు ప్రోక్తం ( భృగు మహర్షిచే చెప్పబడినది) "మను ధర్మ శాస్త్రం " కృతాయుగం లోను "గౌతమ స్మృతి " త్రేతాయుగం లోనూ "శంఖలిఖితుల రచన"  ద్వాపర యుగం లోనూ ప్రామాణికం అవగా ఈ కలియుగం లో "పారాశర స్మృతి" కే ప్రాముఖ్యత ఉన్నది అతి ప్రాచీనమైన సనాతనమైన ఋగ్వేదంలో "మనవు" ఆది ధర్మశాస్త్ర కర్తగా పేర్కొనబడినది హైందవ ధర్మ శాస్త్రాలకు బాట వేసిన "హైందవ జాతి పిత" గా మనువుని అభివ్యక్తీకరించాల్సివుంటుంది 36 లక్షల సంవత్సరాల ప్రమాణం "చాతుర్యుగం" గా చెప్పబడెను  దీనినే "దైవ యుగం" అందురు అట్టి దైవ యుగాలు 71 అయితే  మన్వంతరం అనబడుతుంది మనకు 14 మన్వంతరములు జరిగితే అది బ్రహ్మకి ఒక రోజుతో సమానం ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో ఉన్నాము మనుస్మృతి యందు పేర్కొనబడిన మనువు "స్వాయంభువు" బ్రహ్మ నుండి గ్రహించిన విషయాలని స్వాయంభువు మనువు భృగు మునీంద్రునకు ఉపదేశించెను భృగువు మానవాళికి మనుస్మృతి రూపమున అందించిన ధర్మ శాస్త్రము యాజ్ఞవల్క్య,  గౌతమ...

పద్మశాలి (భృగు బ్రాహ్మణ) వంశ విశిష్టత వైభవం

చిత్రం
పద్మశాలీ అనగా అర్థము పద్మశాలీ (సంస్కృతం) : పద్మము నుండి ఉద్భవించిన బ్రహ్మ అని అర్థము శ్లో: పద్మశాలా యస్యసః పద్మశాలః బ్రహ్మ తస్యేయే పద్మశాలీయాః తా: పద్మము(కమలము) ఇల్లుగా కలవారు బ్రహ్మ మరియు ఆయన వంశీయులు బ్రహ్మజ్ఞానం కలిగిన "పద్మశాలీయులు" అని తాత్పర్యం పద్మము : "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మం" లక్ష్మి నివసించు స్థలమే పద్మము (కమలము) శాలి : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః" జనుల చేత కొనియాడబడినవారు (పొగడబడినవారు) పద్మశాలీ అనగా సకల జనుల చేత కొనయాడబడిన కీర్తింపబడిన పద్మోద్భవులు (కమల నివాసులు) అని మరియొక భావర్థము కలదు భృగు బ్రాహ్మణ వంశము సృష్టి ఆరంభము నుండి మహోన్నత కీర్తి ప్రతిష్ఠలచే శ్రేష్ఠ బ్రహ్మణ వంశముగా విరాజిల్లుచున్నది పద్మశాలీ వంశ ప్రశస్తి అనేక శృతి, స్మృతి,  పురాణ, ఇతిహాసములో బ్రహ్మాండ, మార్కండేయ, విష్ణు, మత్స్య,  పద్మ,,  భావనారాయణ, ఇత్యాది పురాణములలో పద్మ సంహిత, అమరకోశము, శ్రీమత్ భాగవతం, ఇత్యాది ఉద్గ్రంథములలో భృగు బ్రాహ్మణ వంశ ప్రశస్తి కలదు పరశర, గౌతమ, వశిష్ఠ, యజ్ఞవల్య ఇత్యాది స్మృతుల్లో భృగు బ్రాహ్మణ ప్రస్థావణలు కోకొల్లలుగా క...

భృగు వంశ బ్రాహ్మణులు

చిత్రం
భృగు వంశ బ్రాహ్మణులను హైహయ వంశ క్షత్రియులు సంహరించుట జగదాంబ భగవతి అంశ భృగు బ్రాహ్మణ బాలకునిగా జన్మించుట : అతి పరమ ప్రాచీణమైన ఆశ్చర్యకర కథ : పూర్వం హైహయ వంశమున "కార్తవీర్యుడు" అను రాజు పరిపాలించుచుండెను అతడు మహా బలశాలి ధర్మమునందు సదాసక్తి కలవాడు అతనికి వేయి భుజములుండెను అందువలన అతడిని "సహస్రార్జునుడు"అని వచించెదరు అతడు మహావిష్ణువు అవతారమని భావింపబడుచుండెను అతడు భగవతి జగదంబ ఉపాసకుడు పరమ సిద్ధుడు, సమస్తము ఇచ్చుటయందు సమర్థుడు, భృగు వంశమునందలి బ్రాహ్మణులు మహా తేజస్సంపన్నులు, మహా తపశ్శక్తివంతులు హైహయ వంశ క్షత్రియ కుల , రాజ పురోహితులు, ఆచార్యులు, పరమ ధార్మికుడు అయిన కార్తవీర్యుడు ఎక్కువ సమయము దానము చేయుచు అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేయుచు సంపదనంతయు భృగు భార్గవులకు దానము చేయుచుండెను భృగువంశ బ్రాహ్మణులు మిగుల ధనవంతులుగా పరిగణింపబడి గజములు, అశ్వములు, రథములు, రత్నములు, బంగారము, వజ్ర వైడూర్యాదికములతో అధిక సంపదలతో జగత్తునందు అపర కుభేరులుగా కీర్తి వారికి కలిగెను కార్తవీర్యుడు చాలా కాలము పృథివిని పాలించి ధనమునంతయు భృగు బ్రాహ్మణులకు దానము చేసినవడై స్వర్గమున...