పోస్ట్‌లు

అక్షయ తృతీయ

చిత్రం
  అక్షయ తృతీయ.. వైశాఖ మాసంలో వచ్చే మూడవ తిథి - తదియ ని అక్షయ తృతీయగా జరుపుకుంటాము.. అక్షయం - అంటే క్షయం లేనటువంటిది.. నశించనటువంటుది అని అర్థం.. శుభకార్యాలకు, ప్రారంభాలకు, నూతన అవిష్కరణలకు ఇది గొప్ప శుభ ముహూర్తం.. (ఈ సంవత్సరం మౌఢ్యమి ఉన్నది) ఈ అక్షయ తృతీయ శుక్రవారంతో కలిసి వస్తుంది.. లక్ష్మీ ఆరాధన, పూజలు, పారాయణాలు జరపడం విశేషంగా ఉంటుంది.. అభివృద్ధి, ఆనందం, ఆశయ సిద్ధి, విజయం, సమృద్ధి, సంపదలను అభివృద్ధి చేయునది అక్షయ తృతీయ.. ఈ రోజున చేసే పూజ, జప, తర్పణ, హోమ, దానాలు అనంత పుణ్య ఫలితాలను అందిస్తాయి..  అక్షయ తృతీయ దానాలకు ప్రత్యేకమైన పర్వదినం ఈ రోజున మనం చేసే ఏ దానమైనా తిరిగి మనకు అక్షయంగా జీవితాంతం అందుతుందని అర్థము.. ధాన్యం, నేయి, వస్త్రాలు, స్వర్ణం, ధనం, జలభాండము (నీటి కుండ), పుస్తకాలు వంటివి దానము చేయాలి.. ఈ రోజున బంగారం కొనాలి అని ఏ శాస్త్రం , ఏ పురాణం చెప్పలేదు‌‌.. ఇది వ్యాపారుల ప్రచారం మాత్రమే.. ఇదే అక్షయ తృతీయ రోజున భగవాన్ శ్రీ పరశురాముడు (భార్గవ రాముడు) జన్మించాడు.. అరణ్యవాసంలో ఉన్నటువంటి యుధిష్టరుడుకి సూర్యుడు అక్షయ పాత్రని అందించాడు. ఒకనాడు దూర్వాసుడు కౌరవుల ఆతిథ్యాన్ని ...

హనుమత్ జన్మోత్సవం - విజయోత్సవం

చిత్రం
రేపు హనుమత్ విజయోత్సవం., హనుమత్ జన్మోత్సవం (జయంతి) కాదు.! హనుమాన్ విజయోత్సవం - 23 ఏప్రిల్ 2024, మంగళవారం.. హనుమాన్ జన్మోత్సవం (జయంతి) - 01 జూన్ 2024, శనివారం.. శ్లో" వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే.! పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.!! హనుమ వైశాఖ మాసం, బహుళ పక్షంలో వచ్చే దశమి తిథి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో.. అంజనాదేవీ - కేసరి  దంపతులకు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడై జన్మించాడు.. మరి ఈ హనుమత్ విజయోత్సవమేమిటి.? హనుమే లేకపోతే రామాయణం సంపూర్ణం కాలేదు.. హనుమే లేకపోతే రావణ సంహారం‌ జరిగేది కాదు.. రామ పట్టాభిషేకం జరిగేది కాదు.!  రావణ సంహారం జరిగిపోయింది, శ్రీ రామ పరివారం అయోధ్య చేరుకుంది.. సీతాసమేతుడై శ్రీరామచంద్రుడు పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు.. సమస్త లోకం ఆనందంలో మునిగిపోయాయి.. శ్రీ రాముడు ఆలోచిస్తూ.. నేడు ఈ సంతోషానికి కారణం.. హనుమ సముద్రాన్ని లంఘించి లంకను చేరి సీత జాడ అన్వేషించడం, అసాధ్యమైన హిమాలయ పర్వతాల నుండి సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం.! ఈ రెండిటిలో ఏది జరుగకపోయినా నేడు ఈ ఆనందం కలిగేది కాదు, శాశ్వత దుఃఖమే లోకాలకు మిగిలేది.!  ఇలా.. ఎన్...

కల్తీ ఓటు | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" కల్తీ ఓటు " కవిత - మోహనకృష్ణ భార్గవ రంగు నోటుతో నల్ల ఓటు గుద్ది మరో తర భవితని మింగి సమాజ కాంతిని కాలరాసి అంధకార వీధిలో ఆనందంగా పయనించే రాహు.. నోట నోట్లు కుక్కిన కట్టల 'కాల' సర్పానికి   సలాం‌ కొట్టి  టెక్కెం‌ మోసి   వంగి వంగి గులాం జేసి బానిసత్వ ముద్రలో‌ మగ్గే అమ్మకానికి అంతరాత్మ.. మింగిన చిల్లర అరగక పేపరుపై కక్కిన ఇంకు కసరు కసిగా ప్రచారానికి మద్ధతు పలికి అంగట్లో సరుకై నిజాన్ని అమ్మి లక్షణాన్ని కోల్పోయిన అక్షరం.. పథకాలతో పతకం వేసి పతనానికి బాటలు రాసి శవాలకు పారాణి పూసి కసిగా సంసారం చేసే   నవాబులు స్వార్థం తో నిండిన సానుభూతి ఉప్పెనలా కురిపిస్తూ రాత్రికి రాత్రి గాల్లో ఎగిరే నోట్ల పక్షులు.. ఇదో జీవిత చదరంగం బ్రతుకులతో జూదమాడే రాజకీయ రణరంగం నువ్వు నేను అతీతులం కాదు మసిపూసి‌న నకిలీ ముఖాలు నవ్వుతూ పలకరిస్తాయి గొంతుకోసే కసాయి రాబందులు కమ్మని కబుర్లతో కవ్విస్తాయి.. చీకటి నీడలో మూసిన తలుపులు నల్లని పరదాల వెనుక మకిలి పట్టిన మనసులు గుసగుసలాడతాయి కబలించి కాటికి పంపే పన్నాగాలు పన్నుతాయి.. ఆర్భాట చప్పుడ్లలో వాగ్ధానాల‌ ప్రతిధ్వనుల నడుమ నిజా...

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"పీడిత ప్రజల‌ గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు" (జననం : 02- 10 - 1926, మరణం : 05 - 11 - 1993) కడ'వెండి' గిన్నెలో కడిగిన తెల్లని ముత్యమతను/ శ్రమజీవుల బువ్వకుండలో కుతకుత ఉడికిన ఎర్రని మెతుకతను/ దోపీడీ గడీలపై సంఘమయి/ దౌర్జన్యాల మీద గుతుపయి‌/ పీడితుల్ని ఏకం చేసిన  'నల్ల పులి' అతను.. - మోహనకృష్ణ తెలంగాణా ఉద్యమ చరిత్రలో గుర్తింపు నోచుకోలేక చీకటిలో మిగిలిన వీరులెందరో.. సాయుధులై నేల రాలిన తారలెందరో.. పోరు వెనుక దాగిన కన్నీటి గాథలెన్నో.. వారి త్యాగాలను స్పృశించి, గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. ఇదే కోవకు చెందిన మరో తార, సాయుధ పోరాటానికి ఊపిరిగా నిలిచిన తెలంగాణ బెబ్బులి, నల్ల పులి నల్లా నర్సింహ్ములు.. ఆయన ఉద్యమ ప్రస్థానంపై విస్తృత చర్చ, పరిశోధన, ప్రచారం అవసరం.. (1 అక్టోబర్ 2023 రోజున - ప్రజా మంటలు దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసం..) ' జనగామ' పోరాటాల పురిటి గడ్డ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, బానిస సంకెళ్ల నుండి స్వేచ్ఛ కోసం పోరాడి నేల రాలిన అమరులెందరో ఈ నేల చరిత్రలో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకున్నారు. సర్...

వర్షపు జల్లులు | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"వర్షపు జల్లులు" మోహనకృష్ణ భార్గవ ఎండిన బతుకులు, పగిలిన గుండెలపై కరుణించి కురిసే తొలకరి జల్లులకై  ఎదురు చూస్తున్నాం.. కానీ..  ప్రచండ మారుతం విరుచుకుపడుతున్నది.. నీలి మేఘాలు కారుచీకట్లలా  గుడిసెలను   కమ్మేస్తున్నాయి..  చీకట్లోకి తోసేస్తున్నాయి.. వాసాలు తడకలు పైకెగసిపడ్తున్నాయి.. నానిన బియ్యపు గింజలు,  వెలగని పొయ్యి దీపం కడుపుకు బురదంటిన మరకలు,  పూటపూట ఆకలి యుద్ధం.. గుడిసె గుడిసెలను మింగుతున్న సుడిగుండాలు.. వైరపు వరుణుడి వైఖరి చూసి  నిస్సత్తువతో ఆకాశం వైపు చూసి రాలుతున్న కన్నీళ్లు.. వర్షాన్ని నిందించలేను,  పేదరికాన్ని భరించలేను.. చలనం లేని సమాజాన్ని అర్థించలేను.. కరుణలేని దైవాన్ని ప్రార్థించలేను.. వర్షపు జల్లుల తొలకరి పలకరింత  పులకరింతలను ఆస్వాదించి మురిసే శక్తి తాహతు మాకు లేవు.. అందరి పరీస్థితి ఒకటే కాదు..  చిరుజల్లులతో.. కొందరి పెదవులపై చిరునవ్వు విరబూస్తే.. మరికొందరి కంట కన్నీరు జారుతుంది.. ఐనా.. వర్షపు జల్లులను దోసిట్లో పట్టేందుకు.. మనసు చేయి చాస్తుంది.. ఆశతో.. ....................

ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం | స్మరణాత్ ముక్తిః | క్షేత్ర సమగ్ర విశ్లేషణ | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం    అరుణాచల శివ - స్మరణాత్ ముక్తిః శ్లో॥ దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే। కాశ్యాంతు మరణాన్ ముక్తిః స్మరణాత్ అరుణాచలే ॥ లయకారకుడు, ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు. మనిషి మోక్షగామి., పునర్జన్మ లేనటువంటి శాశ్వత ముక్తిని కోరుకునే వారికి సాక్షాత్తూ పరమేశ్వరుడే ఉపదేశించిన ముక్తి మార్గాలు నాలుగు.. ఒకటి చిదంబరం లింగాన్ని దర్శించడం, రెండు కమలాలయం - తిరువారూర్ లో జన్మించడం, మూడు కాశీలో మరణించడం, నాలుగు అరుణాచల క్షేత్రాన్ని స్మరించడం.. అయితే పుట్టడం, గిట్టడం రెండు భగవంతుడి ఆటలే.! పైగా చిదంబర రహస్యాన్ని ఛేదించి ఆకాశ లింగాన్ని దర్శించడం అన్నది సామాన్యులకు సాధ్యం కాదు కదా.! ఇక ముక్తిని కోరే మానవులకు మిగిలిన ఏకైక మార్గం అరుణాచల క్షేత్ర స్మరణ మాత్రమే.! అందుకే అరుణాచలం ముక్తి మార్గంగా ఆరాధించబడుతుంది. కేవలం స్మరణ చేతనే ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా అరుణాచలం కీర్తించబడుతుంది. అరుణాచల శివ.. అంటూ మూడుసార్లు పలికినంతటనే వేయి సార్లు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించిన ఫలితం, కోటిసార్లు గంగానది స్నాన మాచరించిన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున...

నవయుగ వ్యాస - పోతన | కవి | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"నవయుగ వ్యాస - పోతన" కవిత - డా. మోహనకృష్ణ భార్గవ కర్షకుడివో కార్మికుడివో భారతావనిలో సాహితీ మందారాలను సేద్యం చేసావు.. సహజ పండితుడవో విరించి సహపాటివో శివ భక్తితో వీరభద్ర విజయాన్ని లిఖించి పద్య మాలికలతో ఈశ్వరార్చన జేసి జీవ పరమాత్మ  సోపాన తర్కమై ఛందస్సుకే చంద్రుడవై ఆచంద్రార్కం నిలిచావు.. శారదా పుత్రుడవై భాషోదయాన్ని గాంచి పండితుల పామరుల రసనపై నవరాసాలు పండించి నవవిధ భక్తి మార్గాలు బోధించి ప్రజల ధన్యుల జేసిన భాగ్య ఫల దాతగా సాహిత్య శబ్ధ విధాతవై నన్నయ తిక్కన సోమనల వారసుడవయ్యావు.. తెనుగు తోటలో బృందావన విహారిని గాంచి ఆలంబనగా ఆలింగనజేసి గోకులాన్ని తలపించే భాగవత కథామృతాన్ని విష్ణు భక్తి రసామృతాన్ని మధుర మాధురీ కవితామృతాన్ని జనులకు అందించగా సంజీవనీ కల్పతరువై బమ్మెరలో వెలసిన భాగవతోత్తముడవై విష్ణుకథా శిరోమణివై శుకముని సూక్తివై హరి భక్తుల ముక్తికి సోపానమైయ్యావు.. రామ భక్తుడవో ‌ రామ మిత్రుడవో పలికించువాడు రామభద్రుండేనంటూ భక్తిలో తడసిన కృతులతో ఆధ్యాత్మిక చైతన్య శృతులతో అలౌకిక తన్మయాన్ని కలబోసి రామచంద్రుని దర్శనమొందిన భక్త శిరోమణి మాట జ...

రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - జనగామ బిడ్డ మోహనకృష్ణకు అరుదైన గుర్తింపు, ఇది జనగామాకు దక్కిన గౌరవంగా భావిస్తున్న ప్రజలు..  Dawn Research and Development Council (DRDC), ఇంటర్ గవర్నమెంట్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి జనగామ జిల్లా‌ కేంద్రానికి చెందిన ప్రముఖ సాహిత్యకారుడు, కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఎంపికయ్యారు,. డీ.ఆర్.డీ.సీ ఇంటర్నేషనల్ సంస్థ భార్గవకి "రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం -2022" ని  ప్రకటించింది.  త్వరలో న్యూఢిల్లీ వేదికగా జరిగే సదస్సులో అంతర్జాతీయ ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయవలసివుండగా మోహనకృష్ణ వెళ్లలేని కారణం చేత వారు ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ కాపీ ప్రతిని పంపించారు,. మరియు షీల్డ్, మొమెంటో, గుర్తింపు బాడ్జ్ వంటివి కొరియర్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. మోహనకృష్ణ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి నిరంతరం అందిస్తున్న సాహిత్యాన్ని, వారి రచనలు, పరిశోధనలను గు...

ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"ఇండియా ఐకాన్" జాతీయ పురస్కారం, "దాదా సాహెబ్ ఫాల్కే -2023" పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ -  సామాజిక, సాహిత్య, సేవా రంగాలలో "ఇండియన్ ఐకాన్" జాతీయ పురస్కారం అందుకున్న జనగామ బిడ్డ మోహనకృష్ణ.. - ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే 2023 పురస్కారంతో ఘన సత్కారం.. 29-04-2023, శనివారం,  సాయంత్రం : హైదరాబాద్ లోని ఎల్.వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్స్ వేదికగా ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ మరియు తాండవం - ది స్కూల్ ఆఫ్ కూచిపూడి వారి సంయుక్త ఆధ్వర్యంలో దాదా సాహెబ్ ఫాల్కే 154 జయంతి సందర్భంగా జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు.  ఈ సభలో ప్రముఖ సినీతారలు, దర్శకులు, నిర్మాతలు, అతిరధమహారధుల సమక్షంలో, నిర్వాహకుల చేతుల మీదుగా జనగామ జిల్లా కు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, లఘుచిత్ర దర్శకుడు డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ ను ఘనంగా సత్కరించారు.  (విజయచిత్ర - సినీ పత్రికలో ప్రచురితమైన వార్త) ఆర్.కే కళా సాంస్కృతిక సంస్థ నిర్వహించిన లఘుచిత్ర పోటిలో మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "నవశకం - ఈతరం రైతన్న ప్రస్థానం" ఉత్తమ ల...