పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

పోగుబంధం | రాపోలు ఆనందభాస్కర్ సమీక్ష

చిత్రం
రాపోలు ఆనంద భాస్కర్   MEMBER OF PARLIAMENT  (2012-2018 RAJYA SABHA) శుభకామన ..  ఎక్కలదేవి మోహనకృష్ణ సామాజిక వర్గ శక్తికి, బహుళ సమాజంలో సముచిత స్థానం సాధనకు, ప్రజాహిత జీవనంలో దామాషా పాటింపునకు చూపుతున్న ఆరాటం స్ఫూర్తిదాయకం.  స్వయంకృషితో తనను తాను నిలుపుకుంటున్న మోహనకృష్ణ పసితనం నుంచి చూపుతున్న పటిమ అనేక సందర్భాల్లో సాటి ప్రజానీకానికి ప్రస్ఫుటమవుతున్నా,  ఎక్కడా తొందర చూపని నిండుదనం తన వ్యక్తిత్వానికి వన్నెతెస్తోంది. మోహనకృష్ణ వాదానికి శాస్త్రీయ ఆధారాలను జోడించే తపన ఆయనకు ప్రత్యేకతను తెచ్చి పెడుతోంది. అందుకే ఆయన భార్గవ వాదాన్ని నేను ఎంతో ఆసక్తితో గమనిస్తున్నాను.   ఆయన జనగామ ప్రాంతంలో సామాజిక వర్గ యువతరాన్ని కదిలించిన తీరు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలలో తన యుక్తియుక్తమయిన పాత్ర నిలుపుకుంటున్న తీరు నేటి యువతరానికి అధ్యయన వస్తువు. ఎక్కలదేవి మోహనకృష్ణ వివిధ మాధ్యమాల ద్వారా చైతన్య వ్యాప్తికి, తన దృక్పథాన్ని వెల్లడి చేసేందుకు చూపే చొరవ ప్రభావవంతం.   అదే రీతిలో మోహనకృష్ణ రచనా వ్యాసంగం పదుననైనది. నిరంతర ఆలోచనలతో, భావాత్మకంగా ...

RRR సినిమాకు వన్నెతెచ్చిన పాట "కొమురం భీముడో"

చిత్రం
RRR సినిమాకు "వన్నెతెచ్చిన పాట" - సుద్దాల అశోక్ తేజ కలం నుండి జాలువారిన "కొమురం భీముడో" (ఆన్వీక్షికీ పబ్లిషర్స్  ప్రై‌.లి. ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన డా. సుద్దాల అశోక్ తేజ కొమురం భీముడో, కొమురం భీముడో పుస్తకంలో ప్రముఖంగా ప్రచురితమైన మోహనకృష్ణ భార్గవ విశ్లేషణ.. "వన్నె తెచ్చిన పాట"..) ఇపుడు దేశం మొత్తం ఎవరినోటా విన్నా ఒకటే మాట వినిపిస్తుంది. అదే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ (RRR)., ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమాని చూసిన ప్రేక్షకుల నడుమ ఒకటే చర్చ సాగుతుంది. అది ప్రముఖ సినీ రచయిత, సాహితీ దిగ్గజం సుద్దాల అశోక్ తేజ వ్రాసిన "కొమురం భీముడో" పాట గురించి, ఈ పాట సినిమా అంతటికి ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు సుద్దాల పాట, కాల భైరవ నోట, కీరవాణి సంగీతంతో పురుడుపోసుకొని ఎన్టీఆర్ నట విశ్వరూపంతో థియేటర్ లో కూర్చున్న...

వివక్ష | కవిత | అగ్రగామి | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
అగ్రగామి పక్షపత్రికలో ప్రచురితమైన  నా కవిత  " వివక్ష " - 03-03-2022 .................................. కవితా శీర్షిక : " వివక్ష " రచన : డా" మోహనకృష్ణభార్గవ చరవాణి : 7416252587 .................................. ఏదిరా నీకులమంటే..! మంగలినేను చాకలినేను కమ్మరి కుమ్మరి కురుమనునేను వడ్డెర వడ్రంగి విశ్వకర్మనునేను జాలరి మేదరి గౌడనునేను జోగిని భోగిని బండారినినేను  బోయనునేను బలిజనునేను తొగటక్షాత్ర ముదిరాజునునేను దాసరినేను దాసినినేను కంటకాసే కాటిపాపనునేను మట్టి ముద్దాడిన బిడ్డ  మహాదిగను నేను పుడమికి పూల'మాల'ను గోవుల కాసే గో 'కుల'మే  నా కులమన్నాడు..! ఏదిరా నీవర్ణమంటే..! కార్మికుడి స్వేదం కంఠం దాటని గరళం మాడిన పేగుల వలయం కంటకారిన కన్నీరు 'తెలుపు' వెలుగును మింగి  గుడెసెల కమ్మిన  చీకటి  'నలుపు' కాలికింద బతుకు  అహంకారాలకు రాసిన నెత్తుటి పారాణి 'ఎరుపు' నిరాశ నిస్పృహల  మట్టి దిబ్బపై చచ్చిన ఆశల శవాల 'బూడిద' వర్ణాలన్నీ నావేనన్నాడు అందుకు కాలికి అంటిన మట్టి  'ఉదా' హరణన్నాడు..! ఎవడురా నువ్వంటే..! పాలిచ్చే పశువు   కాలికింది నలిగ...

అమ్మా.! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.! కవిత

చిత్రం
" అమ్మా.!  నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.! " సరళ వచన శతకం.. తెలంగాణ ఐ.ఏ.ఎస్ ఆఫిసర్, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారి మాతృమూర్తి కీ"శే" బుర్రా గౌరమ్మ గారి స్మృతిలో.. జనగామ రచయితల సంఘం (జరసం)., అక్షర పబ్లికేషన్స్ సంయుక్తంగా ప్రచురించిన  "అమ్మా‌! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.!" సరళ వచన శతకం.. పుస్తకంలో సామాజిక కవి, రచయిత డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ వ్రాసిన "మాతృమూర్తి" కవిత..! ............................................................. శీర్షిక : మాతృమూర్తి రచన : డా" ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ చరవాణి: 7416252587 జనగామ జిల్లా, తెలంగాణ ............................................................. ఈ మూర్తి ఏ వేదమూర్తిని దర్శించిందో తన వేదనలు మరచి గార్గీ మైత్రేయిల తలచి జీవిత పాఠాన్ని గోరుముద్దలతో కలిపి బోధించింది అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి! ఈ మాతృమూర్తి అనసూయా అరుంధతీ కుంతీ సావిత్రుల వారసత్వమేనేమో ధరణిలా సీతలా సహనాన్ని పొందింది అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి! ఈ స్త్రీమూర్తి చెన్నమ్మ రుద్రమ్మ మణిక...

రాపోలు కృషితో చేనేత అభివృద్ధి, సంక్షేమం

చిత్రం
"రాపోలు కృషితో చేనేత సంక్షేమం, అభివృద్ధి" - రాపోల కృషితో " అన్ని రకాల నూలుపై 15%  సబ్సిడీ "   వస్త్ర ఆధారిత, హాన్డ్ లూమ్, పవర్ లూమ్, దర్జీ కుటుంబాలకు "ఈఎస్ఐ & మెడికల్ కవరేజ్ సపోర్ట్" ప్రకటించిన కేంద్రప్రభుత్వం (ప్రజామంటలు దినపత్రికలో ప్రచురితమైన వార్త) న్యూఢిల్లీ : చేనేత కార్మికులు, వస్త్ర ఉత్పాదక రంగాల సంక్షేమం మరియు అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధత కలిగివుందని రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోవిడ్ 19, లాక్డౌన్ సమయంలో సమయంలో చేనేత కార్మికులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనేక చేనేత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది, అలాంటి దుర్భర పరిస్థితుల్లో రాపోలు స్వయంగా "చేనేత భరోసా యాత్ర" చేపట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను పర్యటించి అక్కడి కార్మికులతో సంభాషించి, ఆత్మహత్యలకు పాల్పడిన కార్మిక కుటుంబాలను పరామర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకొని, తోడుగా నేనున్నానంటు ఆత్మహత్యలకు  పాల్పడవద్దని భరోసా ఇచ్చారు.  అనంతరం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానంత్రి నరేేంద్ర మోదీ, భాజాపా జాతీయ అధ్యక్షుడు కేంద్రమంత్రి జగత్ ప్రకాష్ నడ్డ...