పోస్ట్‌లు

జాతీయవాది - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ | డా. మోహనకృష్ణ భార్గవ

చిత్రం
జాతీయవాది – ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ( 27 సెప్టెంబర్ 1915 – 21 సెప్టెంబర్ 2012 ) (జాగృతి వార పత్రికలో ప్రచురితం)  (పద్మాంజలి జాతీయ మాసపత్రికలో ప్రచురితం)       తనకంటూ కావలసింది ఏమీలేదు.. సమాజహితమే తన ధ్యేయం. స్వాతంత్ర్యమే తన జీవిత లక్ష్యంగా చివరి మజిలీ వరకు పోరాటాలే ఊపిరిగా మలుచుకొని, పదవులను, ఆస్తులను తృణప్రాయంగా వదులుకున్న మహాత్ముడాయన. ప్రత్యేక తెలంగాణాని కలగన్న దార్శనికుడు, మన బహుజన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.       బలహీనవర్గమైన చేనేత - పద్మశాలీ సామాజిక వర్గంలో పుట్టి మహాత్మా గాంధీ తరువాత బాపూజీగా తెలంగాణ ప్రజలు ప్రేమతో పిలుచుకునే స్థాయికి ఎదిగిన విధానం యావత్ దేశ ప్రజలకు స్పూర్తిదాయకం. ఆయన త్యాగాలు చిరస్మరణీయం. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని, జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సొంతం చేస్కున్నారు.   ఆయన దళిత, బహజన, పీడీత వర్గాల పక్షపాతి. బలహీన వర్గాల అభివృద్ది కోసం తన జీవితాన్ని దారపోసారు. బాపూజీ పోరాటాలు, త్యాగాలు అందరికి తెలిసిన విషయాలే అయినప్పటికీ జాతీయవాదిగా ఆయనలో మరో కోణం...

వజ్రోత్సవం | ఆజాదీ కా అమృత్ మహోత్సవం | కవిత |మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"వజ్రోత్సవం" ఆజాదీ కా అమృత్ మహోత్సవం | కవిత వజ్రోత్సవమిది.. అజాదీ కా అమృతోత్సవమై మెరిసే.. నీలి గగనం పుష్పామృతమై కురిసే.. పురుడు పోసిన నేల పరవశమై మురిసే.. భరత మాతకు బ్రహ్మోత్సవమిది.. అమృతోత్సవమిది.. హర్ ఘర్ తిరంగా అంటూ.. ప్రతి ఇంటిపై ప్రతి గుండెపై.. భారత శాంతి కపోతం ఎగరే.. వజ్రోత్సవమిది.. కణం కణం భరతమాతకు.. సమర్పణమంటూ.. సర్వాన్ని అర్పించిన.. మహనీయులు త్యాగధనుల.. కీర్తిని చాటే సమయమిది.. అమరుల పాదాలు స్పృశించి.. అశృవులతో అభిషేకించే.. అమృతోత్సవమిది.. గాంధీ తిప్పిన చట్రం.. అశోకుడి ధర్మ చక్రం.. సుభాషుడి చేతి ఖడ్గం.. వివేకుని ధర్మ మార్గం.. వందేమాతర నినాదం.. మహనీయుల బాటే విధానం.. ఇవే మన జాతికి ఆదర్శం.. ఇదే తల్లి భారతీ దర్శనం.. ఇదే స్వాతంత్ర్యానికి నిదర్శనం.. పయోదం దాటి ఎగిరే జెండా.. దేశ ప్రగతికి అమృత భాండా.. ధర్మం కర్మం మోక్ష సాధన.. వేదభూమి వెదజల్లిన బోధన.. లోకహిత సోదర భావన.. సత్యం శాంతి కారుణ్యమృత గగన.. సిరులను తరులను మోసిన అవని.. త్యాగపునాదుల దాచిన పావని.. స్వాతంత్ర్యానికి పండుగ కాదిది.. సమానత్వానికి సంకేతమిది.. ఆజాదీకా అమృతోత్సవమిది.. నవ...

శ్రీ వరలక్ష్మీ వ్రత విధానము

చిత్రం
శ్రీ వరలక్ష్మీ వ్రతము సనాతన సంస్కృతిలో.. వ్రత కర్మానుష్టాలు, వైదిక క్రతువులు, ఇతిహాస పౌరాణిక కథల్లో అనేక ధార్మిక సూక్ష్మ సూత్రాలు దాగివుంటాయి.. వాటికి అర్థం చేసుకుంటూ ఋజుమార్గంలో నడుస్తూ.. ధర్మబద్ధమైన, విలువలతో కూడిన జీవితాన్ని తద్వారా జీవితంలో సుఖసంతోషాలను, సమాజంలో గౌరవాన్ని జీవితానంతర శాశ్వత ముక్తిని పొందాలి..  పురాణాల్లో, శాస్త్రాలలో స్త్రీల కోసం వందకు పైగా వ్రతాలు చెప్పబడ్డాయి., కానీ ఇటీవల కాలంలో మహిళలు శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.  అందుకు కారణం వరలక్ష్మీదేవి భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, సౌభాగ్యానికి ప్రతీక అని.. అయితే మహిళలు వరలక్ష్మీ వ్రత ఆచరణలో దాగిన సూక్ష్మాన్ని మాత్రం గమనించట్లేదు.! భారీ ఏర్పాట్లతో ఘనంగా వ్రతాన్ని ఆచరించడమో, లేక మరే ఇతర ఆర్భాటాలు, దానాలు, సువాసినులకు వాయనాలు అప్పజెప్పడమో అంతరార్థం కానేకాదు.. మనలో దాగొని ఉన్న ఈర్ష్యాద్వేషాలను వదిలి, ప్రతీ స్త్రీలో కూడా లక్ష్మిని దర్శించి, పూజించి, గౌరవించాలి.,  "ఇందిరా ప్రతి గృహ్ణాతు, ఇందిరావై దాదాతిచ" దానం ఇచ్చేది లక్ష్మీయే, పుచ్చుకునేది కూడా లక్ష్మీయ...